Friday, January 07, 2005

తెలుగు చస్తోందా?

తెలుగు చస్తోంది, చస్తోంది అని చాలా మంది మొత్తుకుంటున్నప్పటికీ ఇంకా కొందరు మట్టుకూ నిమ్మకు నీరెత్తినట్లున్నారు. నిజంగా తెలుగు చస్తోందా? ఇదీ ప్రశ్న. ఏమో! కొందరేమో ఇంతకు మునుపెప్పటికన్నా తెలుగు వ్రాసేవారూ, మాట్లాడేవారూ, చదివేవారూ, ఇప్పుడే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్లు, ఈ విషయము కాస్త బోధపడకుండా వుంది. ఎవరైనా ఇటు వస్తే కాస్త విశదీకరించండి. నేటికి సుత్తి ఇంతే.

No comments: